విత్తన బ్రహ్మ 'కొంగర రమేష్'
ఆయన విద్యావంతుడు కాదు, ధనవంతుడూ కాదు, సాధారణ మధ్యతరగతి రైతు కుటుంబీకుడు. గుంటూరు జిల్లా, పెదకాకుమాను గ్రామానికి చెందిన కొంగర రమేష్, తన సృజనాత్మకశక్తి, సామాజిక బాధ్యతను రంగరించి విత్తన ఉత్పత్తి రంగంలో తలపండిన శాస్త్రవేత్తలకే ‘‘దిక్సూచి’’గా మారారు. చిన్నతనంలో తండ్రి కాకుమాను గ్రామ పంచాయితీ సర్పంచ్గా ఉన్న సమయంలో ఉన్న కొద్దిపాటి వ్యవసాయాన్ని పట్టించుకోలేదు.